యూపీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మౌ జిల్లా షాపూర్లోని ఓ ఇంట్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనమయ్యారు. అయితే అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే సరికే ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతైంది.
మృతుల్లో దంపతులతో పాటు ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో గ్యాస్ సిలిండర్పేలడంతోనే అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.