అందరు చూస్తుండగానే రాళ్లు, కర్రలతో దాడి

అందరు చూస్తుండగానే రాళ్లు, కర్రలతో దాడి

గుంటూరు జిల్లా గురజాలలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని అతని ప్రత్యర్థులు నడిరోడ్డుపై చితకబాదారు. అందరు చూస్తుండగానే రాళ్ల, కర్రలతో దాడి చేశారు. పిడుగురాళ్ల మండలం  తుమ్మలచెరువుకు చెందిన సైదాబిపై అతని ప్రత్యర్థులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. సైదాబి వేరే ఊరికి వెళ్లి వస్తుండగా అడ్డగించి దాడి చేశారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. సైదాబీని నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. పొలం దారి విషయంలో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయని సైదాబి కుమారుడు జిలానీ చెప్పారు. వారే తమ తండ్రిపై దాడి చేశారన్నారు.