మివీ ప్లాంటుకు శంకుస్థాపన

మివీ ప్లాంటుకు శంకుస్థాపన

హైదరాబాద్​, వెలుగు :  ఆడియో ఎలక్ట్రానిక్స్ తయారీదారు మివీ (అవిష్కరణ్ ఇండస్ట్రీస్), హైదరాబాద్​లో తమ నూతన అత్యాధునిక ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసింది. ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ పాల్గొన్నారు. ఇక్కడ ప్లాంటుతో పాటు ఆర్ & డి సెంటర్​ ఉంటుంది. దీని నిర్మాణం కోసం రూ. 200 కోట్లు ఇన్వెస్ట్​ చేస్తారు. ఫలితంగా 2,000 మందికి ఉద్యోగాలు వస్తాయి.   ఇయర్‌‌‌‌ ఫోన్‌‌‌‌లు, సౌండ్‌‌‌‌ బార్లు, సిరీస్, గేమింగ్ యాక్సెసరీలతోపాటు  అనుబంధ ఉత్పత్తులు డ్రైవర్లు, పీపీబీఏలు, బ్యాటరీలను ఇక్కడ తయారు చేస్తారు. వచ్చే సంవత్సరం నుంచే ఉత్పత్తి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని కంపెనీ కో–ఫౌండర్​ మిథుల చెప్పారు.