జల్లికట్టులో అపశృతి.. ఇద్దరు పోలీసులతో సహా 45 మందికి గాయాలు

జల్లికట్టులో అపశృతి.. ఇద్దరు పోలీసులతో సహా 45 మందికి గాయాలు

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే జల్లికట్టు క్రీడలో అపశృతి చేటు చేసుకుంది. పోలీసులతో సహా 45 మందికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో గాయపడిన వారిని మధురైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అవనీయపురం జల్లికట్టు కార్యక్రమంలో సోమవారం(జనవరి 15) ఈ ఘటన చోటు చేసుకుంది. 

జల్లికట్టు కోసం వెయ్యి ఎద్దులు, 600 మంది యువకులు పాల్గొన్నారు. అవనీయపురంలో నిర్వహించిన ఈ పోటీ ప్రాంగణం దగ్గర 8వందల మంది పోలీసులు బదోబస్తు నిర్వహించారు. వైద్య సేవలు అందించడానికి 20 మెడికల్ టీమ్ లను సిద్దంగా ఉంచారు. మరో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.