అయోధ్యలో మహిళపై యాసిడ్ దాడి

అయోధ్యలో మహిళపై యాసిడ్ దాడి


ఉత్తరప్రదేశ్ అయోధ్యలో  యువకుడు యువతిపై యాసిడ్తో దాడి చేశాడు.  అయోధ్య హైదర్ గంజ్ లో 25 ఏళ్ల యువకుడు యువతిపై యాసిడ్ పోశాడు. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను లక్నో ట్రామా సెంటర్ కు తరలించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.  నిందితుడిపై ఛార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు. 

పెళ్లి ఆగిపోయిందని..

అయోధ్యలో ఇనాయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే రాజ్ కరణ్ శర్మ (25)కు బాధితురాలితో కొన్ని రోజుల క్రితం వివాహం నిశ్చయమైంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ..వీరి పెళ్లి ఆగిపోయింది. రాజ్ కరణ్ శర్మతో పెళ్లికి వధువు నిరాకరించింది. దీంతో కక్ష్యపెంచుకున్న రాజ్ కరణ్ శర్మ..జులై 10వ తేదీ అర్థరాత్రి యువతి ఇంటికి వెళ్లి..ఆమె నిద్రిస్తున్న సమయంలో యాసిడ్ పోశాడు. 

కారణం చెప్పలేదు..అందుకే..

యువతితో తనకు పెళ్లి నిశ్చమైందని..తీరా పెళ్లి సమయం వచ్చేసరికి ఆపేశారని నిందితుడు రాజ్‌కరణ్ శర్మ తెలిపాడు. ఎందుకు పెళ్లి ఆపేశారో కారణం కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.