- రాముడి పట్టాభిషేకానికి ..ముహూర్తం ఫిక్స్
- ఈ నెల 22న మధ్యాహ్నం 12.20 గంటలకు కార్యక్రమం
న్యూఢిల్లీ : అయోధ్యలోని రామ మందిర ఆలయంలో రామ్ లల్లా పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారయ్యింది. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు రాముడి పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. పట్టాభిషేకం తర్వాత హారతి, సూర్యాస్తమయం అనంతరం దీపాలను వెలిగిస్తారని వెల్లడించారు. రామ్ లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. ప్రధాన వాస్తు శిల్పి ఆచార్య సత్యేంద్ర దాస్ ఈ విషయంపై స్పందిస్తూ.. రామ్ లల్లా విగ్రహం కర్టెన్ను ప్రధాని మోదీ మాత్రమే తొలగిస్తా రని తెలిపారు. అనంతరం రామయ్యకు కాటుక దిద్ది.. విగ్రహానికి బంగారు వస్త్రాలతో అలంకరిస్తామని వెల్లడించారు. ప్రత్యేక పూజలతో పాటు 56 నైవేద్యాలను సమర్పిస్తారని పేర్కొన్నారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందు బాల రామయ్య విగ్రహా న్ని అయోధ్యలో ఊరేగింపునకు తీసుకువెళ్తారని చెప్పారు.