న్యూఢిల్లీ: అయోధ్య తీర్పు.. దేశంలో ప్రస్తుతం ఇదే ట్రెండింగ్. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న హాట్ టాపిక్గా నిలిచింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక శనివారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి నెటిజన్లు వివిధ హాష్ట్యాగ్లతో అయోధ్య తీర్పుపై టాపిక్లను ట్రెండింగ్లోకి తెచ్చారు. ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 ట్రెండింగ్లలో 5, ఇండియాలో పదికి పది టాప్ ట్రెండింగ్ టాపిక్లు అయోధ్య తీర్పుపైనే ఉండడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా #AyodhyaVerdict హాష్ట్యాగ్ టాప్లో నిలిచింది. ఐదున్నర లక్షలకుపైగా ట్వీట్లతో ఫస్ట్ప్లేస్ సాధించింది. ప్రపంచంలో ట్రెండ్ అయిన టాప్ 5 టాపిక్లలో అయోధ్య తీర్పుపైనే నాలుగు హాష్ట్యాగ్లున్నాయి.
ఇక, ఇండియాలో#BabriMasjid, ayodhyaJudgement, #Ramjanmabhoomi, #RamMandir వంటివి ట్రెండ్ అయ్యాయి. మన దగ్గర అత్యంత ఎక్కువగా ట్రెండ్ అయిన అంశాల్లో #RamMandir రెండో స్థానంలో నిలిచింది. ఆ హాష్ట్యాగ్తో లక్షా 60 వేలకు పైగా ట్వీట్లు వెళ్లాయి. ఇక, అయోధ్యతీర్పును పేర్కొంటూ సుప్రీంకోర్టు హాష్ట్యాగ్తోనూ 2 లక్షల ట్వీట్లు చేశారు నెటిజన్లు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని కాన్స్టిట్యూషనల్ బెంచ్ అయోధ్యపై తీర్పు ఇవ్వడంతో, ఆయన పేరు మీద #RanjanGogoi హాష్ట్యాగ్ కూడా ట్రెండ్ అయింది. #HinduMuslimBhaiBhai హాష్ట్యాగ్తో 30 వేలకు పైగా ట్వీట్లు చేశారు.