శ్రీరామ..జయరామ.. జయజయ రామ..... బాలరామయ్య ఉత్సవ స్నానానికి ఏర్పాట్లు పూర్తి..

శ్రీరామ..జయరామ.. జయజయ రామ..... బాలరామయ్య  ఉత్సవ స్నానానికి ఏర్పాట్లు పూర్తి..

పవిత్ర అయోధ్యలో పండుగ వాతావరణం కన్పిస్తోంది. నగరం రామనామస్మరణతో మార్మోగుతోంది. రామమందిరం గ్రాండ్ ఓపెనింగ్‌కు ముందు ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. సోమవారం ( జనవరి 22)  మధ్యాహ్నం 12.29కి అభిజిత్‌ లగ్నంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. 

విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు బాల రామయ్య విగ్రహానికి 114 కలశాల నీటిని ఉపయోగించి ఉత్సవ స్నానం చేయించనున్నారు.    అనంతరం మహాపూజ, ప్రసాదంలో పరిక్రమ, శయ్యాధివాస్, తత్లాన్యాలు, మహన్యాలు ఆదిన్యాలు,    అఘోర్ హోమం, వ్యాహతి హోమం, సాయంత్రం పూజ, ఆరతి ఉంటాయని అంతేకాదు రాత్రి జాగరణ ఉంటుందని ట్రస్ట్ సభ్యులు చెప్పారు.ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. 

రామజన్మభూమి అయోధ్యను  2వేల క్విటాళ్ల పూలతో  అలంకరించారు.  నగరమంతా రాముడి భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని మొత్తం దీపాలతో నింపారు.

 దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, భక్తులు అయోధ్యకు తరలి వస్తున్నారు. రామాలయ ప్రాణప్రతిష్ట సందర్భంగా నాగ సాధువులు సందడి చేశారు. భారీ ర్యాలీగా అయోధ్యకు నాగసాధువులు తరలివచ్చారు.  స్థానికులు వాళ్లకు ఘనస్వాగతం పలికారు. నాగసాధువుల కర్రసాము, కత్తిసాము అందరిని ఆకట్టుకుంది.