
- కాంగ్రెస్ ఎమ్మెల్సీబల్మూరి వెంకట్ ఎద్దేవా
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని కేటీఆర్ ముందే పసిగట్టారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎద్దేవా చేశారు. అందుకే ఓటమికి కారణాలను ఇప్పటి నుంచే వెతుక్కుంటున్నారని విమర్శించారు.
సోమవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి రెండేండ్లు గడిచినా, తెలంగాణ ప్రజలు కేసీఆర్ను ప్రగతి భవన్ నుంచి తన్ని తరిమేసినా..కేటీఆర్లో ఏమాత్రం అహం తగ్గలేదని బల్మూరి ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేది కాంగ్రెస్సేనని స్పష్టం చేశారు.