కోవిడ్ సెంటర్లో పీపీఈ కిట్ తో పెళ్లి చేసుకున్న జంట

కోవిడ్ సెంటర్లో పీపీఈ కిట్ తో పెళ్లి చేసుకున్న జంట

కరోనా ట్రీట్మెంట్ సెంటర్ లోనే పెళ్లి చేసుకుంది ఓ జంట.రాజస్థాన్ లోని బారాలో పెళ్లి రోజే వధువుకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో కరోనా ట్రీట్మెంట్ సెంటర్ లోనే ఆమె పెళ్లి జరిగింది. అతిథులు లేకుండా రెండు కుటుంబాల నుంచి అతి తక్కువ మంది పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతరుతో పాటు పురోహితుడు, కుటుంబ సభ్యులు కూడా పీపీఈ కిట్స్ వేసుకుని పెళ్లి తంతులో పాల్గొన్నారు. ప్రభుత్వం సూచించిన కోవిడ్ ప్రోటోకాల్స్ ను అనుసరించి పెళ్లి జరిగింది.

రూ.10వేల కోసం మళ్లీ క్యూ కట్టిన వరద బాధితులు