బీజేపీతోనే బీసీలకు రాజ్యాధికారం : చలమల్ల నర్సింహ

బీజేపీతోనే బీసీలకు రాజ్యాధికారం : చలమల్ల నర్సింహ

సూర్యాపేట, వెలుగు : బీజేపీతోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చలమల్ల నర్సింహ చెప్పారు. తెలంగాణలో బీసీని సీఎం చేస్తామని పార్టీ ప్రకటించడంతో బుధవారం జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీజేపీ కేంద్రంలో రెండుసార్లు బీసీ నేతను ప్రధాని చేయడంతో పాటు కేంద్ర మంత్రివర్గంలో 27 మంది బీసీలకు అవకాశం ఇచ్చిందని చెప్పారు.

బీసీ కమిషన్ ఏర్పాటు చేసి రాజ్యాంగ భద్రత కల్పించిందని, చేతి వృత్తుల వారికి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద రూ. 3 లక్షల లోన్లు ఇస్తోందన్నారు. రాష్ట్రానికి బీసీ నేత సీఎం కావాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు మట్ట రమేశ్ యాదవ్

నాయకులు కందాల భాస్కర్, కోడి లింగ యాదవ్, తన్నీరు వాసుదేవ్, పల్స సైదులు గౌడ్, బైరు విజయకృష్ణ, మంతాపురం వెంకటేశ్వర్లు, పున్న వెంకన్న,  బంటు నాగేందర్ ముదిరాజ్, గంగాధర జానకి రాములు, వర్కాల సైదులు, పగిళ్ల వెంకన్న పాల్గొన్నారు.