కోహ్లీ, గంభీర్ పై బీసీసీఐ సీరియస్..భారీగా జరిమానా

కోహ్లీ, గంభీర్ పై బీసీసీఐ సీరియస్..భారీగా జరిమానా

ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచులో హై డ్రామా చోటు చేసుకుంది.  షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునే సమయంలో లక్నో పేసర్ నవీన్ ఉల్ హక్, కోహ్లీ మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో  మ్యాక్స్‌వెల్  వచ్చి గొడవ పెద్దది కాకుండా అడ్డుకున్నాడు. ఆ తర్వాత లక్నో ఓపెనర్‌తో కోహ్లీ మాట్లాడుతుండగా.... ఆ టీం కోచ్ గంభీర్ వచ్చి మేయర్స్‌ను పక్కకు తీసుకెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే గంభీర్, కోహ్లీ మధ్య  వాగ్వాదం చోటు చేసుకుంది. అమిత్ మిశ్రా మధ్యలో వచ్చి కోహ్లీని తీసుకెళ్లగా...కేఎల్ రాహుల్  గంభీర్‌ను సముదాయించారు. అయితే ఈ గొడవపై బీసీసీఐ సీరియస్ అయింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు ఈ రెండు జట్ల ప్లేయర్లు ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

భారీ జరిమానా...

కోహ్లీ, గంభీర్ మధ్య జరిగిన గొడవలో ముఖ్యమైన  ప్లేయర్లకు బీసీసీఐ ఫైన్ విధించింది.  ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.21 కింద లెవెల్ 2 నిబంధనను ఉల్లంఘించినట్లు గంభీర్ ఒప్పుకున్నాడు. దీంతో అతని మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించింది. కోహ్లీ కూడా లెవెల్ 2 తప్పిదం చేసినట్లు అంగీకరించాడంతో అతని  మ్యాచ్ ఫీజులో కూడా 100 శాతం ఫైన్ విధించినట్లు బీసీసీఐ వెల్లడించింది.  ఈ గొడవకు  కారణమైన అఫ్ఘాన్ పేసర్ నవీన్ ఉల్ హక్‌కు మ్యాచ్ ఫీజులో 50 శాతం ఫైన్ వేసింది. బీసీసీఐ విధించిన జరిమానా ప్రకారం కోహ్లీ రూ.1.07 కోట్లు ఫైన్ కట్టనున్నాడు.  గంభీర్ రూ.25 లక్షలు, నవీన్ ఉల్ హక్ రూ.1.79 లక్షలు ఫైన్ చెల్లించనున్నారు.