గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లాకు చెందిన ఇద్దరు రెవెన్యూ ఆఫీసర్లకు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ ఏసీబీ స్పెషల్కోర్టు తీర్పు ఇచ్చింది. ఏసీబీ సీఐ వెంకటరాజాగౌడ్ వివరాల ప్రకారం.. గజ్వేల్ టౌన్కు చెందిన వ్యక్తికి జగదేవ్పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో 24 ఎకరాల భూమి ఉంది. దాని మీద బ్యాంక్ లోన్ తీసుకునేందుకు ల్యాండ్ వాల్యూవేషన్ సర్టిఫికెట్ కావాలని పొలం యజమాని 2008లో జగదేవ్పూర్ తహసీల్దార్ ఆఫీసులో అప్లై చేసుకున్నాడు.
అప్పటి రెవెన్యూ ఇన్స్పెక్టర్పి.హనుమంతరావు, ఇటిక్యాల వీఆర్ఓ వెంకటనర్సింహారెడ్డి.. సర్టిఫికెట్ఇవ్వాలంటే రూ.7వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొలం యజమాని నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్ ఏసీబీ స్పెషల్ కోర్టులో కేసు విచారణ కొనసాగింది. నేరం రుజువైనట్లు తేలడంతో జడ్జి సాంబశివరావు బుధవారం ఇద్దరికి రెండేళ్లు జైలు శిక్షతోపాటు రూ.2వేలు ఫైన్ వేశారు. ఇదే కేసులో మరో సెక్షన్కింద ఇద్దరికీ ఏడాది జైలు, వెయ్యి రూపాయల ఫైన్ విధించారు.