రన్వే అవసరం లేని విమానాలు..! రాబోతున్నాయి..మీరు విన్నది నిజమే.. విమానాలు ఎగరాలన్నా, ల్యాండ్ కావాలన్నా కిలోమీటర్ల రన్ వే కావాల్సిందే.. ఇది మనందరికి తెలుసు.. అందుకే ప్రతి ఎయిర్ పోర్టులతో ప్రత్యేకంగా రన్ వేలను ఏర్పాటు చేస్తారు. అయితే ఇకపై రన్ వేలు లేకుండానే విమానాలను ల్యాండింగ్ చేసే కొత్త టెక్నాలజీ వచ్చేస్తోంది. అది కూడా మన మద్రాస్ ఐఐటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు..
వర్చువల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ (VTOL) విమానాలు అంటే రన్ వే అవసరం లేకుండా నెమ్మదిగా ల్యాండ్ అయ్యే విమానాలకోసం హైబ్రిడ్ రాకెట్ థ్రస్టర్లతో కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో అడుగు ముందుకు వేశారు.
రియల్-టైమ్ హైబ్రిడ్ రాకెట్ థ్రస్టర్ ను వర్చువల్ సిమ్యులేషన్ తో కలిపిన ఓ లేటెస్ట్ ప్రయోగంలో సాఫ్ట్ ల్యాండింగ్ కోసం అవసరమైన వేగాన్ని పరిశోధకులు సాధించారు. మానవరహిత లేదా మానవరహిత అన్వేషణ మాడ్యూల్ గ్రహ ల్యాండింగ్ నుంచి VTOL విమానం భూగోళ ల్యాండింగ్ వరకు అన్ని క్రాఫ్టులకు ఇది కీలకమైన లక్షణం.
Also Read : 27 శాతం పెరిగిన బజాజ్ ఫైనాన్స్లోన్లు
ఐఐటీ మద్రాస్ తన పరిశోధన వివరాలను ఓ ఇంటర్నేషన్ జర్నల్ ప్రచురించింది. ఈ సిస్టమ్ టెక్నికల్ గా , కమర్షియల్ గా ఉపయోగించగలిగితే ప్రపంచ వైమానిక రంగంలోనే గేమ్ ఛేంజర్ గా మారే అవకాశం ఉంది. ప్రయోగం సక్సెస్ అయితే విమానాలను కొండలపై, గుట్టలపై ఉన్న ప్రాంతాల్లో కూడా ఈజీగా ల్యాండింగ్ చేయొచ్చని మద్రాస్ ఐఐటీ పరిశోధకులు చెబుతున్నారు.
