మమతా బెనర్జీకి తీవ్ర గాయం

మమతా బెనర్జీకి  తీవ్ర గాయం

 కోల్‌‌కతా: తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి తీవ్ర గాయమైంది. సీఎం తన ఇంటి వద్ద కింద పడటంతో నుదుటిపై గాయమైందని, వెంటనే కోల్‌‌కతాలోని ఎస్‌‌ఎస్‌‌కేఎం ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు టీఎంసీ పార్టీ గురువారం ఎక్స్‌‌(ట్విట్టర్)లో వెల్లడించింది. మమత నుదుటిపై గాయం నుంచి రక్తం కారుతున్న ఫొటోను, తలకు కట్టుకట్టిన తర్వాత తీసిన వీడియోను ఆ పార్టీ రిలీజ్ చేసింది. మమత త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కాగా, మమత  త్వరగా కోలుకుని, ఆరోగ్యంతో తిరిగి రావాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, బీజేపీ స్టేట్ చీఫ్​ సుకాంత మజుందార్ ఆకాంక్షించారు.  మమత త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు.