
- శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల బెస్ట్ సింగరేణియన్లుగా మధుసూదన్రావు, అంకులు
కోల్బెల్ట్/నస్పూర్, వెలుగు: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల్లో బెస్ట్ సింగరేణియన్లు, ఏరియా ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేసినట్లు శ్రీరాంపూర్ డీజీఎం అనిల్కుమార్, మందమర్రి పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ బుధవారం వేర్వేరుగా తెలిపారు. శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల బెస్ట్ సింగరేణియన్లుగా ఆర్కే-5 మైన్ ఎస్డీఎల్ ఆపరేటర్ అటికం శ్రీనివాస్, కాసిపేట1 గని కోల్ కట్టర్ పొలవేని అంకులును ఎంపిక చేశామన్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జరిగే రిపబ్లిక్ వేడుకల్లో సీఎండీ బలరాంనాయక్, డైరెక్టర్లు వీరిని సన్మానిస్తారని వెల్లడించారు.
శ్రీరాంపూర్ఏరియా ఉత్తమ ఉద్యోగులు
శ్రీరాంపూర్ఏరియా స్థాయి ఉత్తమ ఉద్యోగులుగా బండ మధుకర్, సీహెచ్.ప్రవీణ్(ఆర్కే-5), రంగు రమేశ్కుమార్, బొజ్జ రాజయ్య(ఆర్కే-6), బుద్దే శ్రీనివాస్, కొండిపాక వెంకటి(ఆర్కే-7), జె.దీక్షిత్, ఎన్.వెంకటేశ్వర్లు(ఆర్కే న్యూటెక్), రెంటల నారాయణరెడ్డి, ఎగుడ మధుకర్(ఎస్సార్పీ1), దైదా బాబురావు, బైండ్ల శ్రీనివాస్(ఎస్సార్పీ3,3ఏ), బొడకుంట లక్ష్మయ్య, బొడ్డు తిరుపతి(ఇందారం1ఏ), ఆత్మకూరి వెంకటేశ్, నంది రమేశ్ (ఇందారం ఓసీపీ), కొత్తపల్లి శ్రీనివాస్, ఎనగందుల రాజయ్య (శ్రీరాంపూర్ఓసీపీ), రావిపాటి శ్రీనివాస్రావు (శ్రీరాంపూర్ సీహెచ్పీ)ని ఎంపిక చేశారు.
మందమర్రి ఏరియా ఉత్తమ ఉద్యోగులు
షేక్ఇస్మాయిల్, బి.శ్రీనివాస్(శాంతిఖని), బియ్యాల వెంకటేశం, కన్నోజు నాగేశ్వర్రావు(కాసిపేట), కట్ట ఉదయ్మోహన్, ఆర్.తిరుపతి( కాసిపేట-2), మురుకుంట్ల మల్లేశ్, కడలి సత్యనారాయణ(కేకే5), పూసల ప్రకాశ్, కవటం సురేశ్( కేకేఓసీపీ), రాపోలు శ్రీనివాస్(ఆర్కేపీ సీహెచ్పీ)ను బెస్ట్ ఎంప్లాయ్గా ఎంపిక చేశారు. వీరిని ఆయా ఏరియా పరిధిలో జరిగే వేడుకల్లో సన్మానించనున్నారు.