న్యూఢిల్లీ: దేశంలోని 14 రాష్ట్రాలకు మే 1 నుంచే కోవాగ్జిన్ డైరెక్ట్ సప్లయ్ మొదలు పెట్టినట్లు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం 14 రాష్ట్రాలకు ఈ సప్లయ్ మొదలైందని అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే కేటాయింపుల ప్రకారమే రాష్ట్రాలకు ఈ వ్యాక్సిన్స్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కేటాయింపు పొందిన మరికొన్ని రాష్ట్రాలు కూడా సప్లయ్ కోరుతున్నాయని సుచిత్ర ఎల్లా ఒక ట్వీట్లో తెలిపారు. రాష్ట్రాలకు కోవాగ్జిన్ రేటును అంతకు ముందున్న రూ. 600 నుంచి రూ. 400కి తగ్గిస్తున్నట్లు భారత్ బయోటెక్ ఏప్రిల్ 29న ప్రకటించిన విషయం తెలిసిందే.