కొవాగ్జిన్ ధర తగ్గించేది లేదు

కొవాగ్జిన్ ధర తగ్గించేది లేదు

150 రూపాయలకు డోసు చొప్పున సప్లై చేస్తూ పోతే భవిష్యత్‌లో తమకు భారం అవుతుందని కొవాగ్జిన్ వ్యాక్సిన్ మేకర్ భారత్ బయోటెక్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వానికి ఒక్కో డోసు 150 రూపాయలకు సప్లై చేస్తోంది భారత్ బయోటెక్. ధరలు తగ్గించాలని భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్‌లతో కేంద్రం చర్చించబోతోందన్న వార్తల నేపథ్యంలో... ధరలు తగ్గించబోమని ఆ సంస్థ స్పష్టం చేసింది. ప్రైవేట్‌లో మాత్రం 14వందల 10 రూపాయలకు అమ్ముతోంది. ప్రభుత్వానికి 150 రూపాయలకు అమ్మడం వల్ల వచ్చిన లోటును భర్తీ చేసుకునేందుకు ప్రైవేట్‌లో అధిక ధరకు అమ్మడం తప్పనిసరి అని క్లారిటీ ఇచ్చింది.