న్యూఢిల్లీ: త్వరలో రాబోతున్న ఐపీఓ ద్వారా ఈ–స్కూటర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్భవీశ్ అగర్వాల్ 4.74 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఓలా ఈ పబ్లిక్ఇష్యూలో దాదాపు రూ.5,500 కోట్ల తాజా ఇష్యూ ఉంటుంది. అంతేగాక, 95,191,195 ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ఉంటుంది.
దీనికి సంబంధించిన ఇష్యూ తేదీ, ప్రైస్ బ్యాండ్ వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అగర్వాల్ విక్రయిస్తున్న షేర్లు ఐపీఓ ఓఎఫ్ఎస్ ఖాతాలోకి వస్తాయి. అంటే, మొత్తం డబ్బు ఆయన జేబులోకి వెళ్తుంది. ప్రెష్ఇష్యూ ద్వారా వచ్చే డబ్బు మాత్రమే సంస్థ ఖాతాలోకి వెళ్తుంది.
ఐపీఓలో 75 శాతం షేర్లను క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీలు)కు, 15 శాతం షేర్లను నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎన్ఐఐలు) కోసం కేటాయిస్తారు. రిటైల్, వ్యక్తిగత బిడ్డర్లకు 10 శాతం వరకు షేర్లు ఇస్తారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఐపీఓ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఓలాకు 2023 సంవత్సరంలో ఆదాయం రూ.2,630.93 కోట్లకు చేరుకుంది.