‘భీమ్లా నాయక్’ ట్రైలర్ వచ్చేసింది

‘భీమ్లా నాయక్’ ట్రైలర్ వచ్చేసింది

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ మేనియా నడుస్తోంది. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా కాంబోలో వస్తున్న మల్టీస్టారర్‌ మూవీ ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. దీంట్లో పవన్, రానా ఢీ అంటే ఢీ అంటూ డైలాగులతో దుమ్మురేపారు. ‘నాయక్.. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ’ అంటూ రానా కొట్టిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. అదే సమయంలో ‘నేను ఇవతల ఉంటేనే చట్టం.. అవతలికొస్తే కష్టం’ అంటూ పవన్ చెప్పిన డైలాగ్ కూడా ఈలలు వేసేలా ఉంది. పవన్ పాత్ర గురించి మురళీశర్మ చెప్పిన డైలాగ్ కూడా బాగుంది. రానా పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ వచ్చిన ట్రోల్స్ కు ఈ ట్రైలర్ తో మేకర్స్ గట్టిగా సమాధానం చెప్పారు. పవన్ తో ఢీ అంటే ఢీ అంటూ రానా పాత్ర సాగుతుందని ట్రైలర్ తో హింట్ ఇచ్చారు.

ఇక ‘భీమ్లా నాయక్’లో పవన్‌ సరసన నిత్యామీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రానా పక్కన సంయుక్తా మీనన్ యాక్ట్ చేస్తోంది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగులు అందించిన భీమ్లాకు.. టాప్ ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ బాణీలు సమకూర్చాడు. మలయాళ సూపర్‌ హిట్‌ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. హిందీలోనూ అదేరోజున అలరించడానికి పవన్, రానాలు రెడీ అవుతున్నారు. 

మరిన్ని వార్తల కోసం:

కార్బెవ్యాక్స్ వినియోగానికి డీసీజీఐ గ్రీన్ సిగ్నల్

బాలయ్య కొత్త లుక్ అదిరింది

హిట్మ్యాన్ కెప్టెన్సీలో భారత్ మరో ఘనత