
ఏపీ శాసనసభలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2019-20 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ అంచనా రూ.2,27,974.99 లక్షల కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.1,80,475 లక్షల కోట్లు అని మంత్రి బుగ్గన చెప్పారు. బుగ్గన తొలిసారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. 2018-19 బడ్జెట్తో పోలిస్తే ఈ బడ్జెట్లో 19.32 శాతం పెరుగుదల ఉందని అన్నారు. రెవెన్యూ లోటు రూ.1,778.52 కోట్లు, ద్రవ్యలోటు సుమారు రూ.35,260 కోట్లు అని వెల్లడించారు.