
- భూపేందర్ సింగ్ హుడా
న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరుపై పార్టీ చీఫ్ సోనియా గాంధీ సంతృప్తి వ్యక్తంచేశారని మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా చెప్పారు. ఎన్నికల రిజల్ట్స్ తర్వాత శనివారం హుడా సోనియా గాంధీని కలుసుకున్నారు. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఫలితాలపై చర్చించారు.
సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ… హర్యానాలో కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ బాగుందని సోనియా మెచ్చుకున్నారని అన్నారు హుడా. 90 సీట్లున్న అసెంబ్లీలో బీజేపీ 40 సీట్లు, కాంగ్రెస్ 31 సీట్లు, జేజేపీ 10 సీట్లు గెలుచుకోగా మిగతా 9 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలుపొందారు.