తమిళనాడు కూనూరులో సంభవించిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులు, మిగిలిన సైనిక సిబ్బంది కోసం భూటాన్ రాజు జిగ్మే కెసర్ నామగ్యాల్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బిపిన్ రావత్, మధులికా రావత్ తోపాటు మిగతా సిబ్బంది ఆత్మకు శాంతి చేకూరాలని జిగ్మే దంపతులు, ఆయన తండ్రి గ్యాల్ పో ప్రార్థనలు చేశారు. బిపిన్ దంపతుల ఫొటోల ముందు కొవ్వొత్తులు, దీపాలు వెలిగించారు. అనంతరం జిగ్మే మాట్లాడుతూ.. జనరల్ బిపిన్ రావత్ పలుమార్లు భూటాన్ ను సందర్శించారని గుర్తు చేశారు. ఆయన్ను ఓ మిత్రుడిలా తమ దేశ ప్రజలు భావిస్తారని చెప్పారు. రావత్ ను తాము ఎప్పటికీ మర్చిపోమన్నారు. కాగా, 2017లో డోక్లాం ట్రైజంక్షన్ వద్ద భూటాన్ భూభాగాన్ని ఆక్రమించాలని చైనా ప్రయత్నించింది. అప్పుడు భూటాన్కు భారత్ అండగా నిలిచింది. ఆ సమయంలో బిపిన్ రావత్ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించారు.
♦తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన బిపిన్ రావత్ దంపతులు, మిగిలిన సైనిక సిబ్బంది ఆత్మకు చేకూరాలని భూటాన్ రాజు జిగ్మే కెసర్ నామగ్యాల్ దంపతులు, ఆయన తండ్రి గ్యాల్పో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. pic.twitter.com/vnXHWq9Uir
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) December 10, 2021