పేపర్ లీక్ పై అభ్యర్థుల నిరసన..పోలీసుల లాఠీఛార్జ్

పేపర్ లీక్ పై అభ్యర్థుల నిరసన..పోలీసుల లాఠీఛార్జ్

బీహార్‭లోని పాట్నాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పేపర్ లీక్ ఘటనపై బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాట్నా వీధుల్లో నిరసన చేపట్టారు. ఆన్ లైన్‭లో లీకైన పేపర్ వైరల్ కావడంతో అభ్యర్థులు.. బీఎస్ఎస్‭సీ సీసీఎల్ 3 పరీక్షను రద్దు చేయాలని సెలక్షన్ కమిషన్‭ను డిమాండ్ చేశారు. వందలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. 

సెలక్షన్ కమిషన్‭కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులపై బీహార్ పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కొందరిని అరెస్టు చేసి స్టేషన్‭కు తరలించారు. నిరసనకారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పాట్నా పోలీసులు తెలిపారు.