బీహార్లోని పాట్నాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పేపర్ లీక్ ఘటనపై బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాట్నా వీధుల్లో నిరసన చేపట్టారు. ఆన్ లైన్లో లీకైన పేపర్ వైరల్ కావడంతో అభ్యర్థులు.. బీఎస్ఎస్సీ సీసీఎల్ 3 పరీక్షను రద్దు చేయాలని సెలక్షన్ కమిషన్ను డిమాండ్ చేశారు. వందలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు.
సెలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులపై బీహార్ పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కొందరిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. నిరసనకారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పాట్నా పోలీసులు తెలిపారు.