పాట్నా: పోలీసు సిబ్బందితో వస్తున్న ఓ బస్సు బైక్ను ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. బీహార్లోని డియోరియో గ్రామ సమీపంలోని చాప్రా సివాన్ హైవేపై బుధవారం జరిగిందీ ప్రమాదం. జయప్రకాశ్ నారాయణ్ 120వ జయంతి సందర్భంగా సితాబ్ దియారాలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో బందోబస్తు కోసం వెళ్లిన పోలీసులు ఓ బస్సులో తిరిగొస్తున్నారు. మార్గ మధ్యలో వీరి బస్సు డియోరియో గ్రామ సమీపంలోకి రాగానే, ఓ బైక్ను ఢీకొట్టింది.
దీంతో బైక్పై ఉన్న ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు దూరంగా ఎగిరిపడి, అక్కడికక్కడే చనిపోయారు. మరో వ్యక్తి బైక్తో సహా బస్సు కింద పడ్డడు. బైక్ను ఆ బస్సు 90 మీటర్లు ఈడ్చుకెళ్లింది. దీంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగగా, బస్సు కింద ఇరుకున్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. బస్సుకు మంటలు అంటుకోవడంతో అందులో ఉన్న పోలీసు సిబ్బంది కిందికి దిగి దూరంగా పరుగులు తీశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.