మావోయిస్టు అగ్రనేతకు నేటివిటీ సర్టిఫికెట్

మావోయిస్టు అగ్రనేతకు నేటివిటీ సర్టిఫికెట్

గద్వాల, వెలుగు: మావోయిస్టు అగ్రనేత పోతుల పద్మకు గురువారం నేటివిటీ సర్టిఫికెట్​ జారీ చేశారు. మావోయిస్టు సెంట్రల్  కమిటీ సభ్యురాలు పోతుల పద్మ ఈ నెల 13న పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఆమె నేటివిటీ సర్టిఫికెట్  కోసం బుధవారం ఆమె తల్లి వెంకమ్మ, కుటుంబసభ్యులు తహసీల్దార్​ ఆఫీస్​లో దరఖాస్తు చేసుకున్నారు. 

రెవెన్యూ ఆఫీసర్లు గట్టు మండలం పెంచికలపాడు విలేజ్ లో గురువారం ఎంక్వైరీ చేశారు. అయిజలో చదువుకున్నప్పటి ఆరవ తరగతి సర్టిఫికెట్లు వెరిఫై చేశారు. గ్రామానికి చెందిన వెంకమ్మ, తిమ్మారెడ్డి కూతురేనని నిర్ధారిస్తూ నేటివిటీ సర్టిఫికెట్ ను జారీ చేశారు.