బీజేపీపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. కాషాయ పార్టీ విధానాలు, కమలనాథులు ఆడుతున్న రాజకీయాలను ప్రశ్నించారు. దేశంలో సోషలిజం, లౌకిక వాదం, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నాశనం చేసిందని ఆరోపించారు. ఇప్పటికైనా బీజేపీ సోషలిజాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. లేకుంటే ఈసారి తమ పోరాటం యూపీని కాపాడుకోవడమే కాదు..ప్రజాస్వామ్యం, సోషలిజం, లౌకిక వాదాన్ని రక్షించుకుంటామని స్పష్టం చేశారు. కాషాయ పార్టీ వీటిపై దాడులు చేసి సంస్థలను నాశనం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Lucknow | BJP still needs to understand socialism. This time the fight is not only about saving the state but also saving democracy, socialism, and secularism. BJP is attacking these and destroying institutions: Samajwadi Party chief Akhilesh Yadav pic.twitter.com/nQxra2dtLx
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 28, 2022
మరిన్ని వార్తల కోసం