ఛత్తీస్ఘఢ్లో బస్తర్ సంస్కృతిని రక్షించేందుకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని సీఎం భూపేష్ బఘేల్ అన్నారు. కొండగాన్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. అందుకే అనేక బ్యాంకు శాఖలు ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ రహదారుల పనులు త్వరలో పూర్తవుతాయని తెలిపారు. 90శాతం ఇళ్లకు విద్యుత్ కంనెక్షన్స్ అందిచామన్నారు. బస్తర్ ప్రాంతంలో సాగునీటి డిమాండ్ ఎక్కువగా ఉందని.. ఆదునిక వ్యవసాయ పద్దతులు మెరుగవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కుళాయిల ద్వారా ప్రజలకు సురక్షితమైన మంచినీటి సౌకర్యాన్నిఅందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం
పీవీ బయోపిక్ లో ఎవరికీ తెలియని విషయాలు