
- 2019 నుంచి కోల్డ్ వార్
- రెండుగా చీలిపోయిన క్యాడర్
- స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బయటపడ్డ విభేదాలు
మహబూబ్నగర్, వెలుగు: పాలమూరు బీజేపీలో పంచాయితీ నడుస్తోంది. ఎంపీ డీకే అరుణ, ఆ పార్టీ స్టేట్ట్రెజరర్బండారి శాంతికుమార్మధ్య ఉన్న విబేధాలు బయట పడ్డాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్రెండుగా చీలిపోయింది.
స్టేట్చీఫ్ ఎదుటే గో బ్యాక్ నినాదాలు
బీజేపీ స్టేట్చీఫ్గా రాంచందర్ రావు బాధ్యతలు తీసుకున్నాక గత శనివారం మొదటిసారి పాలమూరు జిల్లాలో పర్యటించారు. ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎంపీ డీకే అరుణతోపాటు పార్టీ స్టేట్ ట్రెజరర్ బండారి శాంతికుమార్, రాష్ట్ర, జిల్లా లీడర్లు హాజరయ్యారు. అయితే శాంతికుమార్ను స్టేజీ మీదకు పిలవగానే డీకే అరుణ వర్గం నాయకులు గో బ్యాక్అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా శాంతికుమార్ వర్గంవారు జిందాబాద్ జిందాబాద్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం సమావేశం ప్రారంభమయ్యాక.. ఎంపీ ఘాటు విమర్శలు చేశారు. కొందరి పేర్లు నేను తీసుకోను.. ఆ కొందరే గత పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ లైన్ క్రాస్ చేశారు.. జై శ్రీరామ్ అంటాం కదా! శ్రీ రాముని మీద ఒట్టేసి చెప్పండి. మీరంతా బీజేపీకి అనుకూలంగా పని చేశారా? గత ఎన్నికల్లో నేను ఓడిపోవాలని ఎవరు పని చేశారో, అనుకూలంగా ఎవరు పని చేశారో పార్టీ వద్ద రిపోర్ట్ఉందన్నారు. ఎన్నికల సందర్భంగా పలువురితో రాజీనామా చేయించినోళ్లు ఇవాళ మీటింగ్ కు రావడం ఏంటని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
శాంతికుమార్కు రెండుసార్లు చేజారిన టికెట్..
మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండారి శాంతికుమార్ కొన్నేండ్లుగా బీజేపీలో కొనసాగుతున్నారు. 2019 పార్లమెంట్ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన గ్రౌండ్వర్క్ చేసుకున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల స్థానం నుంచి పోటీ చేసిన డీకే అరుణ ఓడిపోయారు. తర్వాత ఆమె బీజేపీలో చేరి, మహబూబ్నగర్ ఎంపీ టికెట్దక్కించుకున్నారు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ శాంతికుమార్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. హైకమాండ్ అరుణకే కేటాయించింది. ఆమె ఎంపీగా గెలిచారు. రెండుసార్లు శాంతికుమార్కు టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. దీంతో అప్పటినుంచి ఇద్దరి మధ్య కోల్డ్వార్ నడుస్తోంది.
బీసీ సంఘాల లీడర్ల ఆరోపణలు
బీజేపీ కార్యకర్తల సమావేశంలో బీసీ లీడర్కు అవమానం జరిగిందంటూ బీసీ సంఘాల లీడర్లు ఆరోపిస్తున్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన నాయకులను బీజేపీ అణగదొక్కేందుకు ప్రయత్నిస్తోందని అంటున్నారు. శాంతికమార్కు ఎంపీ డీకే అరుణ క్షమాపణలు చెప్పకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వబోమని హెచ్చరిస్తున్నారు. బీజేపీకి చెందిన బీసీ లీడర్లు మాత్రం డీకే అరుణ, శాంతికుమార్ మధ్య విబేధాలు పార్టీకి సంబంధించిన వ్యవహారమని చెబుతున్నారు.