ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన బీజేపీ : రంగారావు

ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన బీజేపీ : రంగారావు
  • సీపీఐఎంఎల్​ మాస్​లైన్ ​రాష్ట్ర కార్యదర్శి రంగారావు

గోదావరిఖని, వెలుగు: దేశంలో ఎన్నికల కమిషన్​పూర్తిగా వైఫల్యం చెందిందని, అది బీజేపీ జేబు సంస్థగా మారిందని సీపీఐ ఎంఎల్​మాస్​లైన్​ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి  పోటు రంగారావు ఆరోపించారు. దేశంలో ప్రధాని మోదీ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, ప్రజాస్వామ్యం కూడా ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం గోదావరిఖని ప్రెస్​క్లబ్​లో జరిగిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. బిహార్​ లో 60 లక్షల ఓట్లను తొలగించి బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికల కమిషన్​వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టులాంటిదని విమర్శించారు.

 కేంద్ర ఎన్నికల కమిషనర్లు ​వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. తెలంగాణ రైతులకు సరిపడా యూరియాను కేంద్రం సరఫరా చేయాలని, సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్​ చేశారు. ఈ మీటింగ్​లో లీడర్లు కట్ట రమ, నంది రామయ్య, జూపాక శ్రీనివాస్, తోకల రమేశ్, జాడి దేవరాజ్, జిందం రాంప్రసాద్, గుమ్మడి వెంకన్న, పెండ్యాల రమేశ్​పాల్గొన్నారు.