హైకోర్టు నోటీసులకు సమాధానం ఎందుకియ్యలే?

హైకోర్టు నోటీసులకు  సమాధానం ఎందుకియ్యలే?

గద్వాల, వెలుగు: హైకోర్టు నోటీసులకు నాలుగేండ్లుగా సమాధానం ఎందుకు ఇవ్వలేదని బీజేపీ లీడర్లు సంజీవ్  భరద్వాజ్, గడ్డం కృష్ణారెడ్డి, రామాంజనేయులు, బలిగెర శివారెడ్డి ప్రశ్నించారు. ఆదివారం బంగ్లాలో మీడియాతో మాట్లాడుతూ ఇల్లీగల్  గోదామ్​లపై హైకోర్టులో కేసు ఉందని, అది అమ్మినా చెల్లదని తెలిసి అమాయకులకు అంటగట్టిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

 తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు హైకోర్టు తీర్పును కూడా ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. చట్టాలపై నమ్మకం లేని వ్యక్తులు చట్టసభలో ఉండడం దురదృష్టకరమన్నారు. ప్రజలను నమ్మించేందుకు హైకోర్టు తీర్పును వక్రీకరించే ప్రయత్నం చేసినా నడవదన్నారు. దొడ్డిదారిన వస్తున్నారని అనడం న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసినట్లు అవుతుందన్నారు. కబీర్ దాస్, నర్సింలు, తరుణ్  పాల్గొన్నారు.