గుంతల రోడ్లపై వరినాట్లు

గుంతల రోడ్లపై వరినాట్లు

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ టౌన్ లో రోడ్ల పై ఉన్న గుంతలను పూడ్చడంలేదని బీజేపీ నేతలు మండిపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద గుంతల్లో నిలిచిన నీటిలో వరి నాట్లు వేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్​మాట్లాడుతూ.. రూ. 2 కోట్లతో తెలంగాణ తల్లి చౌరస్తా నుంచి పొట్టి శ్రీరాములు చౌరస్తా వరకు రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టి ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. 

ALSO READ :అవినాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఒలింపిక్స్​ బెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జనాలు అవస్థలు పడుతున్నా ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరీశ్ బాబు,అసెంబ్లీ కన్వీనర్ వీరభద్ర చారి, టౌన్ అధ్యక్షుడు సిందం శ్రీనివాస్, నాయకులు విశ్వేశ్వర్ రావు, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.