రాజకీయాలకు బీజేపీ ఎంపీ హర్షవర్ధన్ బై బై

రాజకీయాలకు బీజేపీ ఎంపీ హర్షవర్ధన్ బై బై

 న్యూఢిల్లీ : రాజకీయాల నుంచి తప్పుకుం టున్నట్టు ఢిల్లీలోని చాందినీచౌక్ బీజేపీ ఎంపీ హర్షవర్ధన్ ఆదివారం ప్రకటించా రు. ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ‘‘30 ఏండ్ల రాజకీయ జీవితంలో టొబాకో, డ్రగ్స్, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ఉద్యమించా. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా సేవ చేశా. ఉన్నత పదవుల్లో కొనసాగా. ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. ఆర్ఎస్ఎస్ లీడర్​షిప్ ఒత్తిడి మేరకు నేను ఫార్మా రంగం వదిలి రాజకీయాల్లో అడుగుపెట్టా. పేదరికం, అనారోగ్యం, అజ్ఞానం అనేవి నా ప్రధాన శత్రువులు. మోదీతో కలిసి పని చేసే అవకాశం దక్కడం నా అదృష్టం’’ అని హర్షవర్ధన్​ చెప్పారు.