ట్యాపింగ్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు.. సీబీఐతో విచారణ చేయించాలన్న ఎంపీ లక్ష్మణ్

ట్యాపింగ్‌పై గవర్నర్‌కు  ఫిర్యాదు..  సీబీఐతో విచారణ చేయించాలన్న ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్​: ఫోన్​ ట్యాపింగ్ చేసి బీఆర్ఎస్​ నేతలు దేశద్రోహానికి పాల్పడ్డారని బీజేపీ రాజ్యసబ ఎంపీ లక్ష్మణ్​ ఆరోపించారు. ట్యాపింగ్ బాధ్యులు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదన్నారు. ఫోన్​ ట్యాపింగ్​పై రాజభవన్​లో గవర్నర్ రాధాకృష్ణన్ ను బీజేపీ నేతలు కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో తమ పార్టీ నేతల ఫోన్లు ట్యాప్​ చేసి  బీఆర్ఎస్​ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు.

 ట్యాపింగ్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్​ను కోరారు. ప్రతిపక్ష నాయకులు, ప్రముఖులు, సినిమా వాళ్ల ఫోన్లను ట్యాప్​ చేసి మాఫియా రాజ్యాన్ని నడిపారని ఆయన మండిపడ్డారు. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన ట్యాపింగ్​పై విచారణ జరపాలని డిమాండ్​ చేశారు. దీని వెనక ఉన్న దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.