బూత్​ స్థాయిలో కష్టపడితే.. గెలుపు బీజేపీదే : శాంతి కుమార్

బూత్​ స్థాయిలో కష్టపడితే.. గెలుపు బీజేపీదే : శాంతి కుమార్

నారాయణపేట, వెలుగు: బూత్​ స్థాయిలో బలపడితే బీజేపీ గెలుపు ఖాయమని బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ , కర్ణాటక బీజేపీ సంఘటన మంత్రి, వీబీ రాజేశ్​, రాష్ట్ర సీనియర్ నాయకులు నాగురావు నామాజీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మెట్రో ఫంక్షన్ హాల్ లో పలు మండలాల బూత్ కమిటీల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ.. రానున్న 50 రోజులు నాయకులు కార్యకర్తలు కష్టపడితే కమలం గెలుపును ఏ శక్తీ ఆపలేదనీ అన్నారు. కుటుంబ పార్టీ బీఆర్ ఎస్ అవినీతిని, కాంగ్రెస్ ను ఓడించి తెలంగాణ లో బీజేపీని అధికారంలోకి తేవాలన్నారు.

ఇచ్చిన హామీలను నెరవేర్చని బీఆర్​ఎస్​ను, కార్నటకలో తోకముడిన కాంగ్రెస్​ను ఎవరూ నమ్మరని అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాసులు, నాయకులు వెంకట్ రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు సత్య యాదవ్, బీజేపీ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ నందు నామాజీ, సీనియర్ నాయకులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వి.బాలింగం, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్ పాల్గొన్నారు.