కోలిండియా ఒప్పందాలను అమలు చేస్తాం : యాదగిరి సత్తయ్య

కోలిండియా ఒప్పందాలను అమలు చేస్తాం : యాదగిరి సత్తయ్య

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణిలో బీఎంఎస్​ను గెలిపిస్తే కోల్ ఇండియా ఒప్పందాల అమలుకు కృషి చేస్తామని బీఎంఎస్ స్టేట్​ ప్రెసిడెంట్, స్టాండర్డైజేషన్​ కమిటీ మెంబర్ ​యాదగిరి సత్తయ్య అన్నారు. మంగళవారం మందమర్రి ఏరియా కాసీపేట-1 గనిపై నిర్వహించిన గేట్​మీటింగ్​లో ఆయన మాట్లాడారు. బొగ్గు గని కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందాలు, ప్రమోషన్ పాలసీలు, అలవెన్సులపై ఆదాయ పన్ను రియింబర్స్​మెంట్ కల్పిస్తామన్నారు.

కార్మికుల సంక్షేమం కోసం మెరుగైన విద్య, కార్పొరేట్ వైద్యం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సింగరేణికి రావాల్సిన విద్యుత్ బొగ్గు బకాయిలను సంస్థకు చెల్లించే విధంగా, కొత్త బొగ్గు గనులు ప్రారంభించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు బీఎంఎస్​పనిచేస్తుందని వెల్లడించారు. బీఎంఎస్ ఏరియా కార్యదర్శి గుర్రం ప్రదీప్ కుమార్, వైస్ ​ప్రెసిడెంట్​ డొనికేన రమేశ్ గౌడ్, జిల్లా అధ్యక్షులు లగిసెట్టి కమలాకర్, కార్యదర్శి మద్దూరి రాజు యాదవ్ పాల్గొన్నారు.