తిరుమలలో బొలెరో వాహనం బోల్తా.. నలుగురికి గాయాలు

తిరుమలలో బొలెరో వాహనం బోల్తా.. నలుగురికి గాయాలు

తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. బాస్యంగార్ల సన్నిధి మలుపు దగ్గర బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తాపడ్డింది. ఈ ప్రమాదంలో నలుగురు తమిళనాడు భక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్ లో తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. తిరుపతి నుంచి తిరుమలకు స్వామివారి దర్శనానికి వెలుతుండగా ఈ ఘటన జరిగింది.