రాఖీ సావంత్ తల్లికి బ్రెయిన్ క్యాన్సర్.. బోరున ఏడ్చేసిన నటి

రాఖీ సావంత్ తల్లికి బ్రెయిన్ క్యాన్సర్.. బోరున ఏడ్చేసిన నటి

ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉండే బాలీవుడ్ నటి రాఖీ సావంత్ బోరున ఏడ్చేసింది. తన తల్లికి క్యాన్సర్ ఉందంటూ విలపించింది.బ్రెయిన్ క్యాన్సర్ తో పోరాడుతూ ఆస్పత్రి బెడ్ పై ఉన్న తన తల్లి ఫొటోను రాఖీ సావంత్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 

తాను మరాఠి బిగ్ బాస్ 4లో పాల్గొనడం వల్ల తన తల్లి ఆరోగ్యం గురించి తెలుసుకోలేకపోయానని రాఖీ సావంత్ ఉద్వేగానికి గురైంది. తన తల్లి ఆరోగ్యం బాగోలేదని, ఆమె కోసం అందరూ ప్రార్థించాలని వేడుకుంది.