ప్రాణప్రతిష్ఠ రోజున జననం..బిడ్డ పేరు రామ్ రహీం..

ప్రాణప్రతిష్ఠ రోజున జననం..బిడ్డ పేరు రామ్ రహీం..

   ఫిరోజాబాద్ :  బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజున పుట్టిన తన బిడ్డకు ఓ ముస్లిం మహిళ రామ్ రహీమ్ అని పేరు పెట్టారు. ఫర్జానా అనే మహిళ  సోమవారం ఓ మగ శిశువుకు జన్మనించిందని డిస్ట్రిక్ ఉమెన్ హాస్పిటల్ ఇన్ చార్జ్ డాక్టర్ నవీన్ జైన్ తెలిపారు. తల్లి, బిడ్డలు ఇద్దరూ ఆరోగ్యకరంగానే ఉన్నారని చెప్పారు. శిశువు అమ్మమ్మ హుస్నా బాను ఆ బాబుకు రామ్ రహీమ్ అని పేరు పెట్టారని ఆయన పేర్కొన్నారు. హిందూ, ముస్లిం ఐక్యతకు నిదర్శనంగానే తాను బాబుకు రామ్ రహీమ్ అని పేరు పెట్టానని హుస్నా బాను స్పష్టం చేశారు.