
యాదాద్రి, వెలుగు: మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్ఎస్నుంచి ఇద్దరు డైరెక్టర్లు, కాంగ్రెస్నుంచి ఒకరు డైరెక్టర్గా గెలుపొందారు. ఇటీవల ముగ్గురు డైరెక్టర్ల పదవీ కాలం ముగియడంతో ఆయాస్థానాలకు శనివారం ఎన్నికలు నిర్వహించారు. తుంగతుర్తి పరిధిలోని 2 స్థానాలకు 5 మంది పోటీ చేయగా.. వీరిలో ఇద్దరు బీఆర్ఎస్, ముగ్గురు కాంగ్రెస్కు చెందినవారు. నకిరేకల్పరిధిలోని ఒక పోస్టుకు నలుగురు పోటీ చేశారు. హయత్నగర్లో జరిగిన ఎన్నికల్లో తుంగతుర్తి పరిధిలోని రెండు డైరెక్టర్ల పోస్టులను బీఆర్ఎస్గెలుపొందింది. బీఆర్ఎస్మద్దతుతో పోటీ చేసిన రచ్చ లక్ష్మీ నర్సింహారెడ్డికి 154 ఓట్లు, భాస్కర్ గౌడ్ 240 ఓట్లతో గెలుపొందారు.
కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన శీలం వెంకటనర్సింహారెడ్డికి 152 ఓట్లు సాధించారు. నకిరేకల్ఎమ్మెల్యే వేముల వీరేశం మద్దతుతో పోటీ చేసిన కర్నాటి జయశ్రీ 176 ఓట్లతో గెలుపొందారు. బీఆర్ఎస్అభ్యర్థి రచ్చ లక్ష్మి నర్సింహారెడ్డి గెలిపించేందుకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, డీసీసీ ప్రెసిడెంట్సంజీవరెడ్డి, మదర్డెయిరీ చైర్మన్మధుసూదన్రెడ్డి ఒప్పందం చేసుకున్నారంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఆరోపించిన విషయం తెలిసిందే. మెజారిటీ చైర్మన్లు కాంగ్రెస్కు ఉన్నా.. బీఆర్ఎస్రెండింటిని కైవసం చేసుకోవడం గమనార్హం. 308 పాల సొసైటీల చైర్మన్లు ఓట్లు వేశారు.