బోథ్​ రెవెన్యూ డివిజన్ కోసం .. కొనసాగుతున్న నిరసనలు

బోథ్​ రెవెన్యూ డివిజన్ కోసం ..  కొనసాగుతున్న నిరసనలు

బోథ్​, వెలుగు: బోథ్​నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్​చేయాలని డిమాండ్​చేస్తూ 45 రోజులుగా రెవెన్యూ డివిజన్​ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు, రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం వారికి మద్దతుగా రైతులు బోథ్​లో ఎడ్ల బండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

 ఎడ్ల బండ్లతో బస్టాండ్​లో మానవహారం నిర్వహించారు. తర్వాత రిలే దీక్షల్లో కూర్చొని నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే బోథ్​ను రెవెన్యూ డివిజన్​గా ప్రకటించాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. ఆయా గ్రామాల ప్రజలు, రైతులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.