కవిత లిక్కర్​ స్కామ్​తో తెలంగాణకు తలవంపులు : భట్టి విక్రమార్క 

కవిత లిక్కర్​ స్కామ్​తో తెలంగాణకు తలవంపులు : భట్టి విక్రమార్క 

ఆసిఫాబాద్, వెలుగు:  ఢిల్లీ లిక్కర్ స్కామ్​ లో ఇరుక్కొని సీఎం కేసీఆర్​ కూతురు కవిత తెలంగాణకు తలవంపులు తెచ్చారని సీఎల్పీ నేత  మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.  అవినీతి నిర్మూలన చేస్తానంటూ ఢిల్లీ సీఎం పీఠం ఎక్కిన అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్​తో నోరు మెదపని స్థితికి వచ్చారని మండిపడ్డారు. భట్టి నిర్వహిస్తున్న ‘హాత్​ సే హాత్​ జోడో’  యాత్ర 12 వరోజు(సోమవారం) ఆసిఫాబాద్  జిల్లా రెబ్బెన మండలం కైర్ గాం నుంచి మంచిర్యాల జిల్లా రేపల్లె వాడకు చేరుకుంది.

ఈసందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వనరులను ఆంధ్రా కంపెనీలకు కేసీఆర్ ​ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు.  ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వాల్సిన బొగ్గు గనుల కాంట్రాక్టులను.. ఆంధ్రా బడా బాబుల కంపెనీలకు కట్టబెడుతున్నారని ఫైర్ అయ్యారు.