క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన సెయిట్
న్యూఢిల్లీ: చైనీస్ ప్రొడక్ట్లను బాయ్కాట్ చేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సెయిట్) బుధవారం ఓ క్యాంపెయిన్ను ప్రారంభించింది. డిసెంబర్ 2021 నాటికి చైనీస్ ప్రొడక్ట్ల దిగుమతులను1300 కోట్ల డాలర్లకు తగ్గించడమే లక్ష్యంగా ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేశామని సెయిట్ పేర్కొంది. ప్రస్తుతం ఈ దిగుమతుల విలువ 7,000 కోట్ల డాలర్లుగా ఉంది. ఇండియాలో తయారయ్యే ప్రొడక్ట్లతో రిప్లేస్ అయ్యే 3,000 చైనీస్ ప్రొడక్ట్లను ఈ సంస్థ గుర్తించింది. ప్రస్తుతం ఇండియా–చైనా బోర్డర్ఇష్యూ మళ్లీ తెరమీదకొచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్యాంపెయిన్ ప్రారంభమవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ క్యాంపెయిన్ను ‘ఇండియన్ గూడ్స్–అవర్ ప్రైడ్’ పేరుతో సెయిట్ తీసుకొచ్చింది. చైనా నుంచి రా మెటీరియల్స్,టెక్నాలజీ ప్రొడక్టులు, స్పేర్ పార్ట్స్, అక్కడే తయారైన వస్తువులు(ఫినిష్డ్ గూడ్స్)ను ఇండియా దిగుమతి చేసుకుంటోందని సెయిట్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండెల్వాల్ అన్నారు. మొదట చైనాలో తయారై ఇండియాకు(ఫినిష్డ్ గూడ్స్) వస్తున్న ప్రొడక్ట్లను బాయ్కాట్ చేయాలని సెయిట్ నిర్ణయించుకుందని పేర్కొన్నారు. దేశంలోని ఏడు కోట్ల ట్రేడర్లను, 40,000 ట్రేడ్ అసోసియేషన్లను రిప్రెజెంట్ చేస్తున్నామని ఈ సంస్థ తెలిపింది.
బతుకు భరోసా లేని జర్నలిస్టులు
ఒక్కొక్కరికీ 12 గంటల డ్యూటీ!

