చిచ్చర పిడుగు.. సెల్ ఫోన్ దొంగ ఎదిరించి పట్టుకున్న బాలిక

చిచ్చర పిడుగు.. సెల్ ఫోన్ దొంగ ఎదిరించి పట్టుకున్న బాలిక

తన మొబైల్ ఫోన్ కొట్టేసిన దొంగలను వెంటాడి పట్టుకుంది ఓ విద్యార్థిని . చేతిలోని ఫోన్​ లాక్కొని పారిపోతుండగా  వెంబడించి దొంగను పట్టుకున్న ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బైక్​ పై వెళుతున్న దొంగ బాలిక ఫోన్​ మాట్లాడుతుండగా లాక్కొని పరారయ్యాడు.  ఈ క్రమంలో దొంగ బైక్​ అదుపు తప్పి కింద పడిపోయాడు. చుట్టుపక్కల వారి సాయంతో ఆ దొంగను వెంబడించి పట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే... సోమవారం ( ఫిబ్రవరి 19) మధ్యాహ్నం  మధ్యాహ్నం 3:45 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని కేశవ్ పురం ప్రాంతంలో ట్యూషన్​ క్లాస్​కు వెళ్లి వస్తుండగా దారిలో ఫోన్​ మాట్లాడుతుండగా బైక్​ పై వచ్చిన దొంగ ఫోన్​ లాక్కొన్నాడని పోలీసులకు తెలిపింది.   ఆమె ఫోన్‌ను గట్టిగా పట్టుకున్నప్పటికీ వారు బలవంతంగా ఆమె చేతిలోనుంచి లాక్కుని ఉడాయించారు. వెంటనే ఆమె అటుగా వెళుతున్న ఒక స్కూటరిస్టును దొంగలను పట్టుకోవడానికి సాయం చేయాలని ఆమె కోరింది.

దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)లో అనేక ఫోన్ స్నాచింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. 43 ఏళ్ల మహిళ రిపబ్లిక్ డే రోజున తన ఫోన్‌తో తప్పించుకోవడానికి ప్రయత్నించిన దొంగను వెంబడించి పట్టుకుంది.గుర్గావ్‌లో, స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తన ఫోన్‌ను దొంగిలించారు. డిసెంబరులో జఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్‌ ఆవరణలో ఓ మహిళ మొబైల్‌ ఫోన్‌ లాక్కున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.