నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన బ్రిడ్జి 

నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన బ్రిడ్జి 

అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కూలిపోయింది. సర్దార్ పటేల్ రింగ్ రోడ్డుకు దగ్గరలో నిర్మిస్తున్న బ్రిడ్జి కూలిపోవడం ఆందోళన కలిగించింది. అయితే రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు అన్నారు. నిర్మాణ పనుల నాణ్యతపై ఆరా తీస్తున్నామని.. బ్రిడ్జి ఎందుకు కూలిపోయిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

కాగా, బ్రిడ్జి నిర్మాణంలో వాడిన మెటీరియల్స్ నాణ్యతపై పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనుల పర్యవేక్షణ పైనా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

మరిన్ని వార్తల కోసం: 

దుబాయ్ రాజు విడాకులు.. భార్యకు రూ.5,555 కోట్ల భరణం

కేసులు పెరిగితే స్కూళ్ల మూసివేతపై నిర్ణయం!

భారత పౌరసత్వం కోసం అమెరికన్లు, చైనీయుల అప్లికేషన్లు