
హాంగ్జౌ: రెండు సార్లు వరల్డ్ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఆసియా గేమ్స్లో బ్రాంజ్తో సరిపెట్టింది. ఫేవరెట్గా బరిలోకి గోల్డ్ సాధిస్తుందని ఆశించిన నిఖత్ ఆదివారం జరిగిన 50 కేజీ సెమీఫైనల్ బౌట్లో 2–3తో థాయ్లాండ్కు చెందిన రక్సత్ చుతమట్ చేతిలో పోరాడి ఓడిపోయింది. సెమీస్ చేరడంతో నిఖత్ పారిస్ ఒలింపిక్స్కు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. కాగా, పర్వీన్ 57 కేజీ కేటగిరీలో సెమీస్ చేరి మెడల్తో పాటు ఒలింపిక్స్ బెర్త్ సాధించింది. క్వార్టర్స్లో ఆమె 5–తో సితోర (ఉజ్బెకిస్తాన్)ను ఓడించింది. 60 కేజీ క్వార్టర్స్లో జాస్మిన్ నార్త్ కొరియా బాక్సర్ వొన్ ఉంగ్యోంగ్ చేతిలో ఓడింది.