భారీగా పెరగనున్న బ్రూక్‌‌‌‌ఫీల్డ్ ఆస్తులు.. ఐదేళ్లలో ఏయూఎం 100 బిలియన్​ డాలర్లకు

భారీగా పెరగనున్న  బ్రూక్‌‌‌‌ఫీల్డ్ ఆస్తులు.. ఐదేళ్లలో ఏయూఎం 100 బిలియన్​ డాలర్లకు

హైదరాబాద్​, వెలుగు:  అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ బ్రూక్‌‌‌‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌‌‌‌మెంట్, రాబోయే ఐదేళ్లలో భారతదేశంలో తన నిర్వహణలోని ఆస్తులను (ఏయూఎం) మూడు రెట్లు పెంచి 100 బిలియన్​ డాలర్లకు (సుమారు రూ.8.5 లక్షల కోట్లు) చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.  

బ్రూక్‌‌‌‌ఫీల్డ్ గత 15 సంవత్సరాలుగా భారతదేశంలో చురుకుగా పెట్టుబడులు పెడుతోంది. ప్రస్తుతం మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, పునరుత్పాదక ఇంధనం  ప్రైవేట్ ఈక్విటీ వంటి రంగాలలో సుమారు 30 బిలియన్​ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తోంది.