డ్రైవింగ్ డ్యూటీలో తమ్ముడు.. బస్సును ఆపి రాఖీ కట్టిన అక్క

డ్రైవింగ్ డ్యూటీలో తమ్ముడు.. బస్సును ఆపి రాఖీ కట్టిన అక్క

డ్రైవింగ్ డ్యూటీలో ఉన్న తమ్ముడికి బస్సులోనే అక్క రాఖీ కట్టి, స్వీట్ తినిపించింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దేవక్కపల్లికి చెందిన మెండె రాజు గోదావరిఖని డిపోలో డ్రైవర్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. రాఖీ పండుగకు సెలవు దొరకకపోవడంతో రాజు శుక్రవారం డ్యూటీలో భాగంగా గోదావరిఖని నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నాడు. తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో ఉంటున్న అతడి అక్క తమ్మనవేణి స్వప్న మార్గమధ్యలో బస్సును ఆపి డ్రైవింగ్ సీట్ లో ఉన్న తన తమ్ముడు రాజుకు రాఖీ కట్టింది. అక్కాతమ్ముళ్ల ఆప్యాయతను చూసి ప్రయాణికులు మురిసిపోయారు. - తిమ్మాపూర్, వెలుగు