కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిల‌‌ర్

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిల‌‌ర్

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు:  ఆదిలాబాద్​ పట్టణంలోని 3వ వార్డు బీఆర్​ఎస్​ కౌన్సిలర్​ సాయి ప్రణయ్​ గురువారం కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్‌‌చార్జి కంది శ్రీనివాస్​రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. ఈ సందర్భంగా ప్రజా సేవా భవన్​లో ఆయనతో పాటు పార్టీలో చేరిన తిలక్​నగర్​, ఖానాపూర్​ కాలనీ వాసులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  పార్లమెంట్​ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించడానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి - వెంకట్ రెడ్డి, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ  పాల్గొన్నారు.