నిజామాబాద్, వెలుగు: పలువురు బీఆర్ఎస్ నేతలు బుధవారం నిజామాబాద్ నగరంలోని జాగృతి ఆఫీస్లో తెలంగాణ జాగృతి పార్టీలో చేరగా అధ్యక్షురాలు కవిత కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో మోపాల్ మాజీ జడ్పీటీసీ సభ్యుడు నరేశ్, బీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, బీసీ నేత శ్రీనివాస్గౌడ్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షురాలు మంజుల యాదవ్, తెలంగాణ ఉద్యమకారుడు సూదం రవిచంద్ర, బోధన్ సెగ్మెంట్ పరిధిలోని రాంపూర్ మాజీ సర్పంచ్ దొంత ప్రవీణ్, మహంతం మాజీ సర్పంచ్ రాజేశం, బినోల మాజీ సర్పంచ్ పీతంబర్, మోకాన్పల్లి మాజీ ఎంపీటీసీ జనార్దన్, నందిగావ్ మాజీ ఎంటీపీసీ సంజీవ్ రెంజల్ మండలానికి చెందిన తెలంగాణ శంకర్, గౌరాజీ రాఘవేంద్ర, శేఖర్రాజ్, జాదవ్రాజ్ తదితరులు ఉన్నారు.
